ప్రముఖ పోస్ట్‌లు

6, జనవరి 2011, గురువారం

కోటీశ్వరుడు సాయినాథుడు...


శిర్డీ సాయిబాబా లౌకికపరంగా కూడా మహా కోటీశ్వరుడు! ఆధ్యాత్మికపరంగా సుసంపన్నుడైన సాయినాదŠునికి భక్తులు సమర్పించిన ఆభరణాలు కోట్లాది రూపాయలుగా నిర్థారించారు. ఇహాలోకానికి సంబంధించిన ఈ స్వర్ణాన్ని స్వీకరించి పరలోకానికి చెందిన మహావిలువైన పుణ్యాన్ని మాకందించు సాయీ అంటూ భక్తులు బంగారు, వెండి వస్తువులు ఆయనకు సమర్పిస్తారు. సాయినాదŠుడు వాటిని తన కనుసన్నలలోనే ఉంచి, ఆయా భక్తులకు సద్గతులు సంప్రాప్తింపజేస్తాడు. నిజానికి బంగారం, వెండి తదితరాలకు విలువ మనం ఆపాదించు కున్నదే... కొంత కాలం వాటి విలువ తగ్గుతుంది... మరికొంత కాలం పెరుగు తుంది... అసలు బంగారం, వెండి తదితరలకే కాదు ఈ సృష్టిలో కనిపించే వాటన్నింటికీ విలువ మనం నిర్థారించుకున్నదే... ఈ బంగారాన్ని అగ్నిలో వేస్తే కాలుతుంది. సాగదీస్తే సాగుతుంది. ఎటు వంచితే అటు వంగుతుంది. శరీర అలంకారానికీ, ఈ లోకానికి చెందిన హాోదాకి తప్ప మరిదేనికి ఉపయోగపడుతుంది? దానిని చివరకు ఈ భూమిమీద వదిలి వేయాల్సిందే తప్ప మన వెంట తీసుకుపోలేము కదా...
కానీ శాశ్వత విలువ కలిగిందీ, దాని విలువ ఇంత అని నిర్ణయించలేనిదీ శిర్డీ సాయినాదŠుని వద్ద ఉన్నది. దానిని ఆయన మనకందిస్తే దానిని మన వెంట తీసుకుపోగలము! ఆయన ఇచ్చేది ఆత్మకు అంటుకునేది! శరీరానికి కాదు! దానిని అగ్నిలో వేస్తే కాలదు, నీటిలో తడవదు, వంచితే వంగదు. దాని విలువ మనం నిర్థారించలేం.
సరే ఇక లౌకిక పరంగా సాయి కోట్ల లెక్కలు చూద్దాం...
మహారాష్ట్రలోని శిర్డీ సాయిబాబా మందిరానికి రూ. 32 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు 2009-10 ఆడిట్‌ రిపోర్టులో వెల్లడైంది. వార్షిక ఆదాయం 164.99 కోట్లు లభించగా పెట్టుబడుల మొత్తం రూ. 427.17 కోట్లుగా ఆ నివేదిక పేర్కొంది. రూ. 24.41 కోట్ల బంగారం, రూ. 3.26 కోట్ల వెండి, రూ. 1.12 కోట్ల స్వర్ణ కంఠాభరణాలు ఉన్నట్లు సాయిబాబా సనాతన్‌ ట్రస్టు ఆడిటర్‌ శరద్‌ ఎస్‌. గైక్వాడ్‌ నివేదికలో వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి